: గాడిదల నుంచి అఖిలేష్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది: గుజరాత్ బీజేపీ నేతలు

‘గుజరాత్ గాడిదలు..’ అంటూ ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుజరాత్ కు చెందిన బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ బీజేపీ చీఫ్ జితు వాఘని మాట్లాడుతూ, అధికారం కోసం కన్న తండ్రిపై తిరగబడ్డ అఖిలేష్ యాదవ్, గాడిదల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని అన్నారు. గాడిదలు అఖిలేష్ లా కాకుండా చాలా విశ్వసనీయంగా ఉంటాయని, అలాంటి జంతువుల నుంచి ఆయన నేర్చుకోవాల్సింది చాలా ఉందని అన్నారు. కాగా, ‘గుజరాత్ లో గాడిదలకు ప్రచారం ఆపండి..’ అంటూ గుజరాత్ పర్యాటక శాఖకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ కు అఖిలేష్ సూచిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తమ దైన శైలిలో స్పందిస్తున్నారు.

More Telugu News