: పన్నీర్ వర్గం నుంచి నాకు ప్రాణ హాని ఉంది: అన్నాడీఎంకే నాయకురాలు సరస్వతి

పన్నీర్ వర్గం నుంచి తనకు ప్రాణ హాని ఉందని  అన్నాడీఎంకే అధికార ప్రతినిధి, శశికళ వర్గీయురాలు సరస్వతి ఆరోపించారు. ఈ మేరకు చెన్నై నగర పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సరస్వతి మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా తమ మద్దతు తెలిపే హక్కు ఉందని, అందుకే, తాను శశికళ వైపు నిలిచానని అన్నారు. శశికళకు తన మద్దతు తెలిపినప్పటి నుంచి తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, ఈ ఫోన్ కాల్స్ అన్నీ విదేశాల నుంచే వస్తున్నాయని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా, మాజీ మంత్రులు వలార్ మతి, గోకుల ఇందిర, ప్రముఖ నటి విజయశాంతికి కూడా ఇదే తరహాలో బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ బెదిరింపుల వెనుక పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకే ఐటీ విభాగం మాజీ ఆఫీస్ బేరర్ రామచంద్రన్ ల హస్తం ఉందని, బెదిరింపు ఫోన్ కాల్స్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆమె కోరారు.  

More Telugu News