: ఒక్క విజయవాడలోనే 70 రేప్ లు జరిగాయి: రోజా

చంద్రబాబు నాయుడి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ సాంబశివరావులు ఉన్న విజయవాడలోనే 70 రేప్ లు జరిగాయని... ఇక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. బాబు హయాంలో క్రైమ్ రేట్ 11 శాతం పెరిగిందని పోలీసు రికార్డులే చెబుతున్నాయని తెలిపారు. మహిళల కోసం తాను పోరాటం చేస్తున్నందువల్లే, తనపై కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. తనను అడ్డుకునే ప్రయత్నం ఎంత చేసినా... తాను మాత్రం పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని చెప్పారు. అమరావతిలో జరిగిన మహిళా సదస్సు సందర్భంగా తనను టీడీపీ ప్రభుత్వం అవమానించిన ఘటనపై కోర్టుకు వెళతానని చెప్పారు. కోర్టులు న్యాయం చేస్తాయనే నమ్మకం తనకు ఉందని తెలిపారు.

More Telugu News