: ఇకపై వారిని చేనేత కళాకారులుగా పిలవాలి: పవన్ కల్యాణ్

చేనేత కార్మికులను ఇకపై చేనేత కళాకారులుగా పిలవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన చేనేత సత్యాగ్రహ సభలో పవన్ ఈ పిలుపు నిచ్చారు. చేనేతను గౌరవిస్తే దేశ సంస్కృతిని గౌరవించినట్టేనని చెప్పిన పవన్, సామెతలను ఎలా పడితే అలా వాడి కులాలను కించపరచొద్దని సూచించారు. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న తనను కొందరు కించపర్చారని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చెప్పారు.

More Telugu News