: డీమోనిటైజేషన్ తో స్వర్ణకారులు చాలా నష్టపోయారు: పవన్ కల్యాణ్

ప్రత్యేకహోదా పోరాటంలో అరెస్టైన ప్రతి జనసేన కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రత్యేకహోదా ఎందుకు ఇస్తామన్నారు? తరువాత ఎందుకు ఇవ్వమన్నారు? అన్న నిజాలు ఆయా పార్టీలు వెల్లడించేవరకు ప్రత్యేకహోదా కోసం పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. తాను కేవలం చేనేత కార్మికులకు మాత్రమే కాదని, చేనేత కార్మికులతో పాటు స్వర్ణకారులకు కూడా అండగా ఉంటానని ఆయన తెలిపారు.

డీమోనిటైజేషన్ తో స్వర్ణకారులు చాలా నష్టపోయారని ఆయన అన్నారు. డీమోనిటైజేషన్ కారణంగా డబ్బున్నవారెవరూ ఇబ్బందులు పడలేదని, కేవలం మధ్యతరగతి, పేదలు మాత్రమే చాలా ఇబ్బందుల పాలయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. అలాగే ఈ రంగాలను ఆదుకునేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని, గ్రాంట్స్ కోరాలని వంటి చాలా డిమాండ్స్ తన ముందుకు వచ్చాయని, వాటిని పరిశీలించి, భవిష్యత్ పోరాటం దేనిపై చేయాలో నిర్ణయిస్తానని ఆయన తెలిపారు. 

More Telugu News