: జిహాదీలకు, సైన్యానికి మధ్య జరుగుతున్న పోరులో చిక్కుకున్న‌ 3.5 లక్షల మంది చిన్నారులు

ఇరాక్‌లోని పశ్చిమ మోసుల్‌ నగరంలోకి ప్ర‌వేశించిన సైన్యం అక్క‌డి ఉగ్ర‌వాదుల‌తో భీక‌ర‌పోరులో పాల్గొంటున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అక్క‌డి చిన్నారుల ప‌రిస్థితుల‌పై స్పందించిన‌ లండన్‌ కేంద్రంగా పనిచేస్తున్న సేవ్‌ ద చిల్డ్రన్‌ స్వచ్ఛంద సంస్థ ప‌లు వాస్త‌వాల‌ను తెలిపింది. ఈ పోరులో 3.5 లక్షల మంది చిన్నారులు చిక్కుకున్నారని పేర్కొంది. త‌మ ప్ర‌ణాళిక‌లో భాగంగా అంచెలంచెలుగా ముందుకు క‌దులుతూ వ‌చ్చిన ఇరాకీ ద‌ళాలు చివ‌ర‌కి ప‌శ్చిమ మోసుల్ న‌గ‌రంలోకి వ‌చ్చాయి. వారికి అమెరికా సైన్యం కూడా సాయ‌ప‌డింది.

అయితే, ఆ ద‌ళాలు అక్క‌డి చిన్నారులు, వారి తల్లిదండ్రులకు ఎటువంటి ఆపద కలుగకుండా సాధ్యమైనంత వరకు ప్రయత్నించాలని  సేవ్‌ ద చిల్డ్రన్‌ స్వచ్ఛంద సంస్థ  కోరింది. ఈ యుద్ధంలో చిక్కుకున్న పిల్ల‌లంతా 18 ఏళ్ల లోపువారేనని పేర్కొంది. ఉగ్ర‌వాదుల చేతికి చిక్కి అక్క‌డే ఉంటున్న పిల్ల‌లు, వారి త‌ల్లిదండ్రులు అక్క‌డి నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేయద్దని, అలా చేస్తే ప్రాణాల‌కే ప్ర‌మాద‌మ‌ని సంస్థ ప‌లు సూచ‌న‌లు చేసింది.

More Telugu News