: రూ.3,799కే 4జీ స్మార్ట్ ఫోన్!

 స్వైప్ టెక్నాలజీస్ బ‌డ్జెట్ ధ‌ర‌లో మ‌రో కొత్త‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుద‌ల చేసింది. ‘కనెక్ట్ స్టార్’ పేరుతో విడుదలయిన ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ.3,799 ధరకే ల‌భ్య‌మ‌వుతోంది. షాప్‌క్లూస్ సైట్ ద్వారా ఈ మొబైల్‌ను పొంద‌వ‌చ్చు. 1800 ఎంఏహెచ్ బ్యాటరీ సామ‌ర్థ్యంతో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. 4 ఇంచ్ డిస్‌ప్లే, 850 X 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఉన్నాయి.  ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్, 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 1.3 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0 ఫీచ‌ర్లు ఉన్నాయి.

More Telugu News