: టీవీ సీరియల్ ‘మూగ మనసులు’ ఫేమ్ అమూల్యరెడ్డి వివాహం

జీ టీవీలో ప్రసారమయ్యే తెలుగు సీరియల్ 'మూగ మనసులు' ద్వారా ఎంతో ఫేమ్ అయిన నటి అమూల్య రెడ్డి వివాహం జరిగింది. తన ప్రియుడు అశోక్ రెడ్డితో అమూల్య వివాహం ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. కాగా, అమూల్య నటనా రంగంలోనే కాకుండా మోడలింగ్ లోనూ ఉంది. నటనకు ప్రాధాన్యమిచ్చిన అమూల్య, గతంలో పలు టీవీ ఛానెల్స్ నిర్వహించిన పోటీల్లో ఆమె పాల్గొంది. ప్రముఖ నటుడు నవదీప్ హోస్ట్ గా వ్యవహరించే ఈ టీవీ సూపర్ 2 షో లో కూడా అమూల్య పాల్గొంది.

More Telugu News