: విరాట్ కోహ్లీని వెతుక్కుంటూ వచ్చిన రూ. 100 కోట్ల డీల్

సింగిల్ బ్రాండ్ ప్రచారకర్తగా భారత క్రీడాకారుల్లో విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. స్పోర్ట్స్ లైఫ్ స్టయిల్ బ్రాండ్ 'ప్యూమా' విరాట్ తో రూ. 110 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎనిమిది సంవత్సరాల పాటు అమల్లో ఉండే ఒప్పందంలో భాగంగా కోహ్లీ, ప్యూమాకు చెందిన వివిధ ప్రొడక్టులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నాడు. ఈ డీల్ తో జమైకా స్ప్రింటర్ ఉస్సేన్ బోల్ట్ తో పాటు అసాఫా పావెల్, థెర్రీ హెన్సీ, ఓలివర్ గిరౌడ్ వంటి అంతర్జాతీయ ఆటగాళ్ల సరసన కోహ్లీ నిలిచాడు.

ఈ రూ. 100 కోట్లకు అదనంగా, కోహ్లీ ప్రచారం చేసే బ్రాండ్ల అమ్మకాలపై రాయల్టీని కూడా ప్యూమా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ప్యూమాతో జత కట్టడం తనకెంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఈ బంధం దీర్ఘకాలం సాగాలని కోరుకుంటున్నానని తెలిపారు. కాగా, గతంలో భారత్ కు చెందిన సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీలు కూడా రూ. 100 కోట్ల బ్రాండ్ అంబాసిడర్ డీల్స్ ను ఒడిసి పట్టుకున్నారు.

More Telugu News