: డబ్బిచ్చి బంగారం కొంటున్నారా?.. ఒక్క నిమిషం..!

నగదు చెల్లించి బంగారం కొనుగోలు చేసేవారు ఇక  ముందు ఆలోచించాల్సిందే. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇక నుంచి రూ.2 లక్షలకు మించి బంగారాన్ని నగదుతో కొనుగోలు చేసేవారు అక్కడికక్కడే ఒక శాతం ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ (టీసీఎస్)‌ను చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. నిజానికి రూ.5 లక్షల వరకు బంగారాన్ని నగదు ఇచ్చి కొనుగోలు చేసే అవకాశం ఉంది. అంతకుమించి కొనుగోలు చేస్తేనే టీసీఎస్ చెల్లించాలి. అయితే బడ్జెట్‌లో బంగారాన్ని సాధారణ వస్తువుల జాబితాలోకి ప్రభుత్వం చేర్చింది. దీంతో ఇక నుంచి రూ.2 లక్షలకు మించి బంగారాన్ని నగదుతో కొనుగోలు చేస్తే టీసీఎస్ చెల్లించాల్సి ఉంటుంది.

More Telugu News