: గన్నవరం- వారణాసి మధ్య విమాన సర్వీసు ప్రారంభం

గన్నవరం- వారణాసి (కాశీ) మద్య విమాన సర్వీసు కొంచెం సేపట్లో ప్రారంభం కానుంది. మొత్తం 189 మంది ప్రయాణికులు ప్రయాణించే అవకాశమున్న బోయింగ్ విమానం ఇందుకోసం అందుబాటులోకి రానుంది. ఈ రోజు మధ్యాహ్నం 2.40 గంటలకు గన్నవరం నుంచి బయలు దేరి వారణాసికి 6.50 గంటలకు చేరనుంది. మళ్లీ, మర్నాడు ఉదయం 10 గంటలకు వారణాసిలో బయలు దేరి మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం చేరుకుంటుంది.

More Telugu News