: మంత్రి కేటీఆర్‌కు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కె.తారకరామారావుకు ప్రతిష్ఠాత్మక స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందింది. యూనివర్సిటీ వార్షిక సదస్సులో ప్రధానోపన్యాసం చేయాలంటూ కోరింది. గత రెండున్నరేళ్లలో ఐటీలో తెలంగాణ ప్రగతిని ప్రస్తావిస్తూ మాట్లాడాలని ఆహ్వానంలో పేర్కొంది.  యూనివర్సిటీ ఆహ్వానం మేరకు మే 18, 19 తేదీల్లో కేటీఆర్ అక్కడ పర్యటించనున్నారు. రెండు రోజులపాటు జరగనున్న సదస్సులో ‘ఉపాధి-ఉద్యోగాలు-ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్’ అంశాలపై మంత్రి ప్రసంగిస్తారు.

More Telugu News