: తిరిగి ప్రారంభమైన అసెంబ్లీ.. తన చొక్కా చింపినప్పటికీ సభను నిబంధనల ప్రకారమే నడిపిస్తున్నానన్న స్పీకర్

త‌మిళ‌నాడు శాస‌న‌స‌భ ప్రత్యేక సమావేశం వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైంది. ఆ రాష్ట్ర ప్ర‌తిప‌క్ష డీఎంకే ఎమ్మెల్యేలు సభను తామే బ‌హిష్క‌రిస్తున్నామంటూ వెళ్లిపోయిన విష‌యం తెలిసిందే. సభ‌ సజావుగా సాగనివ్వాలని ధ‌న్‌పాల్ స‌భ‌లో ఉన్న ఎమ్మెల్యేల‌ను మ‌రోసారి కోరారు. త‌న చొక్కా చింపి అవ‌మానించిన‌ప్ప‌టికీ తాను స‌భ స‌జావుగా సాగాల‌నే ఉద్దేశంతో మ‌ళ్లీ వ‌చ్చాన‌ని వ్యాఖ్యానించారు. స‌భ నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే జ‌రుగుతోంద‌ని అన్నారు. మ‌రోవైపు ప‌న్నీర్ వ‌ర్గం స‌భ్యులు, కాంగ్రెస్ స‌భ్యులు త‌మ ఆందోళ‌న కొన‌సాగిస్తున్నారు.

More Telugu News