: సభలోనే ధర్నాకు దిగిన డీఎంకే ఎమ్మెల్యేలు... జత కలిసిన పన్నీర్ వర్గీయులు

తమిళనాడు అసెంబ్లీలో రచ్చ రచ్చ చేసిన డీఎంకే ఎమ్మెల్యేలను స్పీకర్ ధనపాల్ సస్పెండ్ చేశారు. అయినప్పటికీ, వారు సభ నుంచి బయటకు వెళ్లలేదు. వారిని బయటకు తీసుకెళ్లడంలో మార్షల్స్ కూడా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో, తమపై సస్పెన్షన్ విధించినందుకు నిరసనగా డీఎంకే ఎమ్మెల్యేలు సభలో ధర్నాకు దిగారు. వారికి మద్దతుగా పన్నీర్ వర్గం ఎమ్మెల్యేలు కూడా సభలోకి వెళ్లారు. వారితో పాటే సభలో బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News