: నో ప్రాబ్లం.. ఎమ్మెల్యేలందరికీ భద్రత ఉంటుంది.. సభ సాగనివ్వండి: తమిళనాడు అసెంబ్లీ స్పీకర్
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఆ రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో పన్నీర్ వర్గం ఎమ్మెల్యేలు రహస్య ఓటింగ్ జరపాలని పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి అభ్యర్థనను తిరస్కరించిన స్పీకర్ ధన్పాల్ పలు సూచనలు చేశారు. ఎమ్మెల్యేలకు కట్టుదిట్టమైన భద్రత ఇవ్వబడుతోందని, దానికి తాను హామీ ఇస్తున్నానని తెలిపారు. సభను సజావుగా ముందుకు సాగేందుకు సహకరించాలని కోరారు. మరోవైపు డీఎంకే వర్గ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా అన్నాడీఎంకేలోని పళనిస్వామి వర్గీయులు తీవ్రంగా నినాదాలు చేస్తుండడంతో సభ వాయిదాపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.