: విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన పళనిస్వామి.. సభలో తీవ్ర గందరగోళం.. పోటా పోటీ నినాదాల హోరు

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి బ‌ల నిరూప‌ణ ప‌రీక్ష ఎదుర్కుంటున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశంలో పళనిస్వామి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మరోవైపు అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష డీఎంకే ఎమ్మెల్యేలంతా ప‌న్నీర్ సెల్వానికి మ‌ద్ద‌తుగా స‌భ‌లో నినాదాలు చేస్తున్నారు. దానికి ప్ర‌తిగా అన్నాడీఎంకేలోని ప‌ళ‌నిస్వామి వ‌ర్గం డీఎంకేకి వ్య‌తిరేకంగా నినాదాల హోరెత్తిస్తున్నారు. దీంతో స‌భ‌లో తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంది. మ‌రోవైపు శ‌శిక‌ళపై స్టాలిన్ మండిప‌డుతూ ఎమ్మెల్యేలను అక్ర‌మంగా రిసార్టులో ఇన్ని రోజులు బంధించార‌ని అన్నారు.   

More Telugu News