: మా నిర్ణయం రేపే ప్రకటిస్తాం: రేపటి బలనిరూపణ పరీక్షపై తమిళనాడు కాంగ్రెస్

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి రేపే ఆ రాష్ట్ర‌ అసెంబ్లీలో బ‌ల నిరూప‌ణ ప‌రీక్ష ఎదుర్కుంటానని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఆ రాష్ట్ర ప్ర‌తిప‌క్ష పార్టీ డీఎంకే తాము రేపు బ‌ల‌నిరూప‌ణ ప‌రీక్ష‌కు హాజ‌ర‌వుతామ‌ని చెప్పిన నేప‌థ్యంలో ఆ రాష్ట్ర‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈ విష‌యంపై స్పందించారు. రేపటి కార్య‌క్ర‌మానికి తాము వ‌చ్చేది, లేనిది రేపే ప్ర‌క‌టిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఆ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ కి ఉన్న బ‌లం 8. ఒక‌వేళ వీరంద‌రూ రేపు హాజ‌రై ప‌ళ‌నిస్వామికి వ్య‌తిరేకంగా ఓటు వేస్తే ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ఓట్లు వేసిన వారి సంఖ్య 108గా న‌మోదవుతుంద‌ని అంచ‌నా. రేపు ఉదయం 11 గంటలకు ఈ బలనిరూపణ పరీక్ష ప్రారంభమవుతుంది. శశికళ వర్గంలోని ఎమ్మెల్యేలు పళనిస్వామికి రేపు వ్యతిరేకంగా వ్యవహరించే అవకాశాలూ లేక పోలేదని విశ్లేషకుల అంచనా. 

More Telugu News