: థ్యాంక్యూ వెరీ మచ్ సార్... ప్రధాని మోదీకి లేఖ రాసిన పళనిస్వామి!

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎడప్పాడి పళని స్వామిని అభినందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నిన్న ఫోన్ చేసి అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజు పళని స్వామి తొలి లేఖ రాశారు. ‘సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన నాకు, మీ అభినందనలు అందడం ఆనందంగా ఉంది. మీ సహకారం, మద్దతుతో తమిళనాడును మరింత అభివృద్ధి చేస్తా. దివంగత సీఎం జయలలిత ఆశయాలను నెరవేరుస్తా’నని ఆ లేఖలో పళనిస్వామి పేర్కొన్నారు.

More Telugu News