: శాంసంగ్ కు కోలుకోని ఎదురుదెబ్బ!

ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ కు కోలుకోని దెబ్బ తగిలింది. ఈ సంస్థ చీఫ్ జే లీని దక్షిణ కొరియా పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక రోజంతా ఆయనను సుదీర్ఘంగా విచారించారు. అయితే, ఈ విచారణ మొత్తం అత్యంత రహస్యంగానే జరిగింది. దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గ్యూన్ హైని అభిశంసించడానికి కారణమైన అవినీతి భాగోతంలో జే లీ పాత్ర ఉందనే నేపథ్యంలో, ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణంలో భారీ ఎత్తున నగదు చేతులు మారిందని ఆరోపణలు ఉన్నాయి. జే లీ అరెస్ట్ నేపథ్యంలో, శాంసంగ్ కంపెనీ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి.

అయితే, ఈ విచారణపై ఆయన పైకోర్టులో అప్పీల్ చేస్తారా? లేక బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటారా? అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. అయితే, తాను ఎలాంటి తప్పు చేయలేదని... లంచాలు కూడా ఇవ్వలేదని జే లీ అంటున్నారు.

More Telugu News