: పాకిస్థాన్ లో భారీ బాంబు పేలుడు...30 మంది మృతి, 100కు పైగా క్షతగాత్రులు...మిన్నంటిన హాహాకారాలు

పాకిస్థాన్ లో భారీ బాంబు పేలుడు సంభవించింది. పాకిస్థాన్ లోని సూఫీ ముస్లింలు పవిత్రంగా భావించే లాహోర్ లోని షాబాజ్ ఖలందర్ మసీదు దగ్గర ఈ భారీ బాంబు పేలుడు సంభవించింది. దీంతో మసీదు పరిసరాల్లో హాహాకారాలు మిన్నంటాయి. స్థానికులు, పోలీసులు సహాయ చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 30 మంది మృతి చెందినట్టు గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మసీదు పరిసరాల్లో ఎటు చూసినా తెగిపడిన శరీర భాగాలు, మృతదేహాలు కనిపిస్తున్నాయి. క్షతగాత్రులు హాహాకారాలు చేస్తున్నారు. అక్కడ భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. 

More Telugu News