: పన్నీర్ సెల్వం శిబిరంలోని ఎమ్మెల్యేల మంతనాలు!

సీఎం పీఠం తనకు దక్కుతుందనే ధీమాతో ఇన్ని రోజులు ఎదురుచూసిన పన్నీర్ సెల్వంకు నిరాశ ఎదురవడంతో ఆయన శిబిరంలోని ఎమ్మెల్యేలు మంతనాలు ప్రారంభించారు. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న పళనిస్వామికి మద్దతు తెలిపేందుకు పన్నీర్ శిబిరంలోని కొందరు ఎమ్మెల్యేలు కాచుకుని కూర్చున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కువత్తూరు కేంద్రంగా రాజకీయాలు మొదలయ్యాయి. పళనిస్వామి శిబిరంలోకి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్న పన్నీర్ వర్గం ఎమ్మెల్యేలు తమ పని చక్కబెట్టుకునే పనిలో పడిపోయినట్లు తెలుస్తోంది.

More Telugu News