: క్లైమాక్స్... గవర్నర్ తో ముగిసిన పళనిస్వామి భేటీ

అన్నాడీఎంకే శాస‌న‌స‌భ ప‌క్ష‌నేత ప‌ళ‌నిస్వామితో రాజ్‌భవ‌న్‌లో ఆ రాష్ట్ర ఇన్‌ఛార్జీ గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు భేటీ ముగిసింది. వారి మ‌ధ్య 20 నిమిషాల‌పాటు చ‌ర్చ జ‌రిగింది. గ‌వ‌ర్న‌ర్‌తో చ‌ర్చించిన వారిలో ప‌ళ‌నిస్వామితో పాటు సెంగొట్టియ‌న్‌, వేలుమ‌ణి, దిన‌క‌ర‌న్‌, జ‌య‌కుమార్‌, తంగ‌మ‌ణి ఉన్నారు. కాసేప‌ట్లో మీడియాతో గ‌వ‌ర్న‌ర్ మాట్లాడ‌నున్న‌ట్లు తెలుస్తోంది. త‌మకే మెజార్జీ ఉంది కాబ‌ట్టి, ప‌ళ‌నిస్వామిని ప్ర‌భుత్వ ఏర్పాటు చేయ‌మ‌ని గ‌వ‌ర్న‌ర్ త‌ప్ప‌కుండా కోర‌తార‌ని శ‌శిక‌ళ వ‌ర్గీయులు మీడియాతో చెబుతున్నారు. 

More Telugu News