: ఎంజీఆర్ మెమోరియల్ హౌస్ కు చేరుకున్న శశికళ

శశికళ వెంట‌నే లొంగిపోవాల్సిందేన‌ని ఈ రోజు సుప్రీంకోర్టు మ‌రోసారి ఆదేశాలు జారీ చేయ‌డంతో ఇక చేసేదేమీలేక చిన్న‌మ్మ బెంగ‌ళూరుకు బ‌య‌లుదేరిన విషయం తెలిసిందే. మొద‌ట చెన్నై మెరీనా బీచ్ స‌మీపంలో ఉన్న అమ్మ జ‌య‌ల‌లిత స‌మాధిని ద‌ర్శించుకున్న ఆమె, ఆ త‌రువాత అక్క‌డి నుంచి చెన్నైలోని టీన‌గ‌ర్‌లో ఉన్న‌ ఎంజీఆర్ మెమోరియ‌ల్ హౌస్ కు వెళ్లారు. అక్క‌డ ఎంజీఆర్ చిత్ర‌ప‌టానికి ఆమె నివాళులు అర్పించి, అక్క‌డే కాసేపు కూర్చున్నారు. అనంత‌రం టీన‌గ‌ర్ నుంచి బెంగ‌ళూరు ప్ర‌త్యేక న్యాయ‌స్థానానికి ఆమె రోడ్డు మార్గంలో బ‌య‌లుదేర‌నున్నారు.

 

More Telugu News