: సాయంత్రానికి లొంగిపోతాను: సుప్రీంకోర్టుకు తెలిపిన శశికళ

నేటి సాయంత్రంలోగా, బెంగళూరులోని సెషన్స్ కోర్టులో లొంగిపోనున్నట్టు శశికళ సుప్రీంకోర్టుకు వెల్లడించారు. ఈ మేరకు ఆమె తరఫు న్యాయవాది, న్యాయమూర్తులకు తెలిపారు. అంతకుముందు లొంగిపోయేందుకు శశికళ వేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించి, వెంటనే లొంగిపోవాలని ఆదేశించగా, ఆ విషయాన్ని ఫోన్ ద్వారా శశికళకు తెలిపిన న్యాయవాది, ఆపై కోర్టు ముందు ఆమె లొంగుబాటు నిమిత్తం బెంగళూరుకు వెళుతున్నారని, పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. కోర్టు అందుకు సమ్మతించి, సాయంత్రం వరకూ గడువిస్తున్నట్టు తెలిపింది.

More Telugu News