: అమర్త్యసేన్ దేశానికి ఏం ఒరగబెట్టాడు?.. బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
బెంగాలీ ప్రముఖుడు ఒకడు నోబెల్ బహుమతి సాధించాడని, అందుకు మనమంతా గర్వపడాలని బీజేపీ పశ్చిమ బెంగాల్ శాఖ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ను ఉద్దేశించి అన్నారు. అయితే నోబెల్ బహుమతి సాధించిన ఆయన దేశానికి ఏం ఒరగబెట్టాడని, దేశానికి ఏం సేవలు చేశాడని ప్రశ్నించారు. అసలు ఆయనకు పురస్కారం ఎందుకిచ్చారో బెంగాల్లో ఏ ఒక్కరికీ తెలియదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.