: ర్యాలీని విర‌మించుకునే ప్ర‌స‌క్తేలేదు: ప్రొ.కోదండ‌రాం

తెలంగాణ సాధించుకున్న‌ప్ప‌టికీ రాష్ట్రంలో ప్ర‌భుత్వ ఉద్యోగాల నియామ‌కాలకు నోటిఫికేష‌న్ విడుద‌ల కావ‌డం లేదంటూ ఆగ్రహం వ్య‌క్తం చేస్తోన్న టీజేఏసీ ఛైర్మ‌న్ కోదండ‌రాం ఈనెల 22వ తేదీన జేఏసీ నిరుద్యోగుల ర్యాలీకి పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. ఈ ర్యాలీని విర‌మించుకునే ప్ర‌స‌క్తేలేద‌ని ఆయ‌న ఈ రోజు పేర్కొన్నారు. ప్రభుత్వం  నిరుద్యోగులకు స్పష్టమైన హామీ ఇస్తేనే ర్యాలీ విరమించుకునే ఆలోచ‌న చేస్తామ‌ని అన్నారు.

 ఈ రోజు ఆయ‌న వ‌రంగ‌ల్ లో మాట్లాడుతూ... ఈ ర్యాలీని జేఏసీ ప్రతిష్ట కోసం ర్యాలీ చేపట్టడం లేదని ఆయ‌న అన్నారు. తెలంగాణ‌ యువకుల ఆవేదనను తెలియ‌జేయ‌డానికే తాము ఆ నిర‌స‌న తెలుపుతున్నామ‌ని చెప్పారు. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ఇచ్చిన లక్ష ఉద్యోగాల హామీపై స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆయ‌న అన్నారు. అలాగే ప్రైవేటు రంగంలో స్థానిక నిరుద్యోగులకు రిజర్వేషన్ ప్రాతిపదికన ఉద్యోగాలు వ‌చ్చేలా చూడాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

More Telugu News