: సరైన సమయంలో సరైన తీర్పు వచ్చింది: జయలలిత మేనకోడలు దీప

జ‌య‌ల‌లిత‌కు విధేయులై మెలిగిన వారే త‌మిళ‌నాడుకి సీఎం కావాల‌ని ఆమె మేన‌కోడ‌లు దీప ఈ రోజు వ్యాఖ్యానించారు. త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి కోసం పావులు క‌దిపిన శ‌శిక‌ళ న‌ట‌రాజ‌న్‌కు షాకిచ్చేలా ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు వ‌చ్చిన నేప‌థ్యంలో ఈ విష‌యంపై దీప స్పందించారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... జయలలిత గ‌తంలో ఎంచుకున్న వారే సీఎం కావాలని ప‌రోక్షంగా ప‌న్నీర్ సెల్వం పేరును చెప్పారు. ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన‌ తీర్పును స్వాగ‌తిస్తున్నామ‌ని అన్నారు. స‌రైన స‌మ‌యంలో సరైన తీర్పు వ‌చ్చిందని ఆమె వ్యాఖ్యానించారు. త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల‌ను పాలించ‌డానికి శ‌శిక‌ళ‌, ఆమె కుటుంబానికి అర్హ‌త లేద‌ని వ్యాఖ్యానించారు.  

More Telugu News