: రివ్యూ పిటిషన్ వేస్తాం: తంబి దురై

పన్నీర్ సెల్వం స్థానంలో తనకు పార్టీ కోశాధికారి పదవి ఇవ్వకపోవడంతో అలక బూనిన అన్నాడీఎంకే ఎంపీ తంబిదురై తాజాగా స్పందించారు. అక్రమాస్తుల కేసులో శశికళను దోషిగా పేర్కొంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సుప్రీం కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి అయిన శశికళ జైలుకు వెళ్లే పరిస్థితి తలెత్తడంతో, శాసనసభా పక్ష నాయకుడిగా పళనిస్వామిని తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారని చెప్పారు. తమ నాయకురాలిపై తిరుగుబాటు చేసిన పన్నీర్ కు అన్నాడీఎంకే లో స్థానం లేదని అన్నారు.

More Telugu News