: ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచులకు టీమిండియా ఆటగాళ్ల ఎంపిక

ఆస్ట్రేలియా క్రికెట్ జ‌ట్టు త్వ‌ర‌లోనే భార‌త్ ప‌ర్య‌ట‌న‌కు రానుంది. ఈ నెల 23 నుంచి భారత్‌, ఆస్ట్రేలియా మ‌ధ్య పూణేలోని మ‌హారాష్ట్ర క్రికెట్ అసోసియేష‌న్ స్టేడియం వేదిక‌గా మొద‌టి టెస్టు ప్రారంభం కానుంది. ఇక రెండో టెస్టు మ్యాచు బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో వ‌చ్చేనెల 4 నుంచి జ‌రుగుతుంది. ఈ రెండు టెస్టు మ్యాచుల‌కు బీసీసీఐ ఈ రోజు టీమిండియా ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేసింది. ఎంపిక చేసిన ఆట‌గాళ్ల‌లో విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), విజ‌య్‌, రాహుల్‌, పుజారా, ర‌హానే, సాహా, అశ్విన్‌, జ‌డేజా, ఇషాంత్‌, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, ఉమేష్‌, క‌రుణ్‌, జ‌యంత్, కుల్‌దీప్‌, ముకుంద్‌, పాండ్యా ఉన్నారు.  

More Telugu News