: మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయ్.. సిద్ధంగా ఉండండి: శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే

మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయని... ప్రజలంతా సిద్ధంగా ఉండాలని శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే అన్నారు. మహారాష్ట్రలో బీజేపీ, శివసేనల సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, త్వరలో జరగనున్న బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో బీజేపీ, శివసేనలు దేనికదే విడివిడిగా పోటీ చేస్తున్నాయి. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత, బీజేపీ ప్రభుత్వానికి తాము ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకుంటామని ఉద్ధవ్ స్పష్టం చేశారు.

ఇదే సమయంలో ప్రధాని మోదీపై కూడా ఉద్ధవ్ థాకరే తీవ్ర విమర్శలు గుప్పించారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల... 86 శాతం డబ్బు చలామణిలో లేకుండా పోయిందని మండిపడ్డారు. ఏ మాత్రం ఆలోచన లేకుండానే పెద్ద నోట్లను రద్దు చేశారని విమర్శించారు. మోదీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని... కానీ, ఆయన ఎలాంటి వాగ్దానాలను నిలబెట్టుకోలేక పోయారని అన్నారు. రామ మందిర నిర్మాణం విషయంలో కూడా ఎలాంటి పురోగతి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News