: ఏడుకొండలవాడా, ఈ భారీ ప్రయోగాన్ని దిగ్విజయం చేయి!: వెంకన్నకు ప్రత్యేక పూజలు చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు

రేపు ఉదయం 9.28 గంటలకు ఒకేసారి 104 ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపనుంది. ఈ ప్రయోగానికి ఇప్పటికే కౌంట్ డౌన్ మొదలైంది. పీఎస్ఎల్వీ-సీ37 రాకెట్ ద్వారా ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో, తమ ఆనవాయతీని కొనసాగిస్తూ ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. పీఎస్ఎల్వీ-సీ37 రాకెట్ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి, ప్రత్యేక పూజలు చేశారు. ప్రయోగం ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలని వెంకన్నను కోరుకున్నారు.

More Telugu News