: వికారాబాద్ జిల్లా దుద్యాలలో ప్రేమ జంట ఆత్మహత్య

వికారాబాద్ జిల్లాలోని దుద్యాలలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. నందిగామ దగ్గర్లోని పిట్టలగూడకు చెందిన అఖిలకు మేనమామతో వివాహం నిశ్చయించారు. అయితే, ఆ వివాహం ఇష్టం లేని అఖిల, ఆమె ప్రియుడు మధు కలసి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి ఆత్మహత్యను అటుగా వెళ్లిన వ్యక్తులు చూసి, పోలీసులకు సమాచారం అందించడంతో వెలుగు చూసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. 

More Telugu News