: ‘అమ్మకు వందనం’ అనే పేరును ఫైనలైజ్ చేస్తున్నాం: సీఎం చంద్రబాబు

రాబోయే రోజుల్లో ప్రతి పాఠశాలలో, కళాశాలలో ‘తల్లికి వందనం’ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుుడు నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఈ పేరులో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ రోజు విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘తల్లికి వందనం’ అనే దాంట్లో.. తల్లికి బదులు అమ్మ అనే పదం ఉంటే బాగుంటుందని చాలా మంది చెబుతున్నారని, అందుకని, దాని పేరు మార్చి ‘అమ్మకు వందనం’ అనే పేరును ఫైనలైజ్ చేశామని, ఈ విషయమై రేపు కేబినెట్ లో చర్చిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది నుంచే అన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రతి వ్యక్తి తల్లిని గౌరవించాలని, అదే విధంగా, ప్రతి వ్యక్తి భార్య మనోభావాలను అర్థం చేసుకోవాలని, సమాజంలో ఉండే మహిళలను అర్థం చేసుకోవాలని, ఆ గౌరవాన్ని మనం అలవరచుకోవాలని చంద్రబాబు సూచించారు.

More Telugu News