: తప్పుడు ప్రచారం చేశారు.. చర్యలు తీసుకుంటాం: ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల ఆగ్రహం
అమరావతిలో జరిగిన మహిళ పార్లమెంటేరియన్ సదస్సు నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం ఏపీ సభాపతి కోడెల శివప్రసాదరావు చేసిన వ్యాఖ్యల పట్ల విమర్శలు ఎదురవుతుండడంతో ఆయన ఈ అంశంపై మరోసారి స్పందించారు. తన మాటలను వక్రీకరించి ప్రచారం చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై తాను అసెంబ్లీ కార్యదర్శి, న్యాయనిపుణులతో చర్చించానని అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తులు, సంస్థలకు నోటీసులు ఇవ్వాలని ఆయన యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై స్పీకర్ కార్యాలయం సమాచారం సేకరిస్తోంది.