: సచివాలయానికి వెళ్లే యోచనలో పన్నీర్.. ఏం జరగబోతోందో అన్న ఉత్కంఠ!

తమిళనాడు రాజకీయాలు ఎవరికీ అర్థంకాని రీతిలో మలుపులు తిరుగుతున్న వేళ... ఆ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. సచివాలయానికి వెళ్లే యోచనలో ఆయన ఉన్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత... ఆయన ఇంతవరకు సచివాలయం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఈ నేపథ్యంలో, అక్కడకు వెళ్లి ఆయన ఏం చేయబోతున్నారన్న ఉత్కంఠ సర్వత్ర నెలకొంది. మరోవైపు, డీఎంకే నేత స్టాలిన్ కూడా ఈరోజు తన పార్టీ నేతలతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో, ఈరోజు తమిళ రాజకీయాలు మరిన్ని మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. 

More Telugu News