: ఆ ముగ్గురిలో నాకు జగన్ అంటే ఇష్టం: పోసాని

చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్.. ఈ ముగ్గురిలో తనకు జగన్ అంటే ఇష్టమని ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి చెప్పారు. ‘ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్.. ఈ ముగ్గురిలో ఎవరైతే బెటర్?’ అని ఒక న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. ‘దేవుడా.. దేవుడా.. మాయదారి దేవుడా.. ఈ ముగ్గురిలో నాకు జగన్ అంటే ఇష్టం’ అని చెప్పారు.

‘మీరు చేస్తున్నమోదీ జపం భయంతో వచ్చిందా? ఎద లోతుల్లో నుంచి వచ్చిందా?’ అనే ప్రశ్నకు పోసాని స్పందిస్తూ.. ‘పోసాని కృష్ణ మురళీకి ఈ రోజు ఏం కావాలి చెప్పండి, మీరు? నేను బీజేపీలో మెంబర్ ను కాదు’ అన్నారు. ‘మీ దగ్గర బ్లాక్ మనీ ఎక్కువుంది కదా?’ అనే ప్రశ్నకు తనదైన శైలిలో ఆయన జవాబు ఇస్తూ.. ‘ఉంటే.. మొత్తం తీసుకోండి. ఇన్ కం ట్యాక్స్ వాళ్లకు కూడా ఓపెన్ గా చెప్పాను. నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్న డబ్బులు లేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు నేను, నా బిడ్డలు ఎంత సంతోషంగా బతకాలో అంత సంపాదించుకున్నాను’ అని పోసాని చెప్పుకొచ్చారు. 

More Telugu News