: మహారాష్ట్ర మాజీ సీఎం పై ‘ఇంక్’ దాడి

మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ పై గుర్తు తెలియని వ్యక్తి ‘ఇంక్’ దాడికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడేందుకు సిద్ధమైన ఆయనపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కార్యకర్త ఈ దాడికి పాల్పడ్డాడు. అశోక్ చవాన్ ముఖంపై ఇంక్ చల్లడంతో ఆయన నిర్ఘాంతపోయారు. కాగా, ఈ సంఘటనపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు నవాబ్ మాలిక్ స్పందిస్తూ, ప్రజాస్వామ్యంలో వ్యతిరేకత తెలియజేసే విధానం ఇది కాదని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

More Telugu News