: రోజాకు జరిగిన అన్యాయంపై పోరాడతాం: వైఎస్ జగన్

జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకు ఆహ్వానంపై వెళుతున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాను నిన్న గన్నవరం ఎయిర్ పోర్టులో పోలీసులు అడ్డగించడంపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఎమ్మెల్యే రోజాకు జరిగిన అన్యాయంపై పోరాడతామని, ఈ అంశంపై అన్ని వేదికల్లోనూ లేవనెత్తుతామని పేర్కొన్నారు. ఒక మహిళా ఎమ్మెల్యేపై ప్రభుత్వమే ఇలా వ్యవహరిస్తే, సామాన్య మహిళల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానించి మరీ, రోజాను అడ్డుకోవడమంటే, జాతీయ మహిళా పార్లమెంటు సదస్సును అపహాస్యం పాలు చేయడమేనని జగన్ మండిపడ్డారు.

More Telugu News