: రెచ్చిపోయిన ఉగ్రవాదులు... ముగ్గురు జవాన్ల ప్రాణత్యాగం, నలుగురు ఉగ్రమూక హతం

ఇండియాలోకి చొరబడి విధ్వంసం సృష్టించడమే లక్ష్యంగా ఉగ్రవాదులు రెచ్చిపోగా, వారిని అడ్డుకునే క్రమంలో ముగ్గురు జవాన్లు ప్రాణత్యాగం చేశారు. ఈ ఉదయం జమ్మూ కాశ్మీర్ పరిధిలోని కుల్గాం జిల్లాలోని యారిపుర - ఫ్రిజల్‌ సమీపంలో ఉగ్రవాదుల చొరబాటును గమనించిన భద్రతా దళాలు ఎదురు కాల్పులను ప్రారంభించాయి. ఉగ్రవాదుల వద్ద భారీగా ఆయుధాలు ఉండటంతో అదనపు బలగాలు ఆ ప్రాంతానికి తరలి వెళ్లాయి. ఇరు పక్షాల మధ్య ఉదయం నుంచి ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. గాయపడిన ఉగ్రవాదులు కొందరు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో, వారిని కూడా మట్టుబెట్టేందుకు ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు అమరులు కాగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతోంది.

More Telugu News