: కాలిఫోర్నియాలో హత్యకు గురైన తెలుగు విద్యార్థి వంశీరెడ్డి

అమెరికాలో తెలుగు విద్యార్థి కాల్చివేత సంచలనం కలిగించింది. కాలిఫోర్నియాలో ఎంఎస్ విద్యను అభ్యసిస్తున్న వంశీరెడ్డి అనే విద్యార్థిని గుర్తు తెలియని దుండగులు తుపాకితో కాల్చి చంపారు. మృతుడు వరంగల్ కు చెందిన యువకుడని తెలుస్తోంది. వంశీరెడ్డిని అటకాయించిన దుండగులు అతనితో వాగ్వాదం పెట్టుకుని, ఆపై తుపాకితో కాల్చినట్టు సమాచారం. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసు అధికారులు, మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశామని, దుండగులను గుర్తించేందుకు ప్రత్యేక టీములను ఏర్పాటు చేశామని ఓ అధికారి వెల్లడించారు. జరిగిన ఘటనపై మరింత సమాచారం తెలియాల్సివుంది.

More Telugu News