: రాజస్థాన్ లో పాక్ గూఢచారి అరెస్ట్ తో కలకలం!

రాజస్థాన్ లోని జైసల్మేర్ ప్రాంతంలో పాకిస్థాన్ కు చెందిన గూఢచారి పోలీసులకు పట్టుబడటం కలకలం రేపింది. భారత్ - పాక్ సరిహద్దు వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఓ వ్యక్తిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, అతను పాకిస్థాన్ గూఢచారని తేలింది. దీంతో సీఐడీ, నిఘా వర్గాల అధికారులు రంగంలోకి దిగారు. సరిహద్దుల్లోని కీలక సమాచారాన్ని సేకరించి, దాన్ని పాక్ సైన్యాధికారులకు అందించే ప్రయత్నంలో ఉండగా, ఇతన్ని అరెస్ట్ చేసినట్టు ఓ అధికారి తెలిపారు.

More Telugu News