: యూపీలో బీజేపీ ఊపు.. మూడు ఎమ్మెల్సీ స్థానాలు కైవసం

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న సమయంలో బీజేపీకి మాంచి ఊపునిచ్చే సన్నివేశం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని కాన్పూర్, గోరఖ్ పూర్, బరేలీ జిల్లాల్లోని మూడు ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. పట్టభద్రుల కోసం కేటాయించిన ఈ స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా... ఎన్నికల సమయంలో పూర్తి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది బీజేపీ. యూపీ అసెంబ్లీలో పాగా వేయాలనే పట్టుదలతో ఉన్న బీజేపీకి... ఈ ఫలితాలు కలసొచ్చేవేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు తొలి దశ పోలింగ్ జరుగుతోంది.

More Telugu News