: బంగ్లా క్రికెట్ అధికారులకు సలహా ఇచ్చిన కుంబ్లే

తమకు ఓ మంచి స్పిన్ కన్సల్టెంట్ కావాలని కోరుతూ టీమిండియా చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లేను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారులు కలిశారట. దీంతో, భారత మాజీ స్పిన్నర్ సునీల్ జోషిని కలవాలంటూ వారికి కుంబ్లే సలహా ఇచ్చాడట. ఈ నేపథ్యంలో, సునీల్ జోషిని బంగ్లా క్రికెట్ బోర్డ్ అధికారులు కలిశారు. త్వరలోనే స్పిన్ కన్సల్టెంట్ గా జోషిని నియమించుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ అధికారి అక్రమ్ ఖాన్ మాట్లాడుతూ, నాణ్యమైన స్పిన్ కోచ్ ను సూచించాలంటూ కుంబ్లేను అడిగామని... దానికి అతను జోషిని సూచించాడని చెప్పాడు. ఈ క్రమంలో హైదరాబాదులోనే ఉన్న జోషితో చర్చలు జరుపుతున్నామని తెలిపాడు.

భారత్ తరపున 15 టెస్టులు, 69 వన్డేలకు సునీల్ జోషి ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 41 వికెట్లు తీయగా, వన్డేల్లో 69 వికెట్లు తీశాడు. దేశవాళీ క్రికెట్ లో 160 మ్యాచ్ లు ఆడిన జోషి... 615 వికెట్లు తీశాడు. 

More Telugu News