: ఎయిర్ పోర్టులో రూ.54.67 లక్షల విలువైన బంగారం బిస్కెట్లు స్వాధీనం

ముంబయి ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టులో సాధార‌ణ త‌నిఖీల్లో భాగంగా ప్ర‌యాణికుల సోదాలు నిర్వ‌హిస్తోన్న క‌స్ట‌మ్స్ అధికారులు ఓ ప్ర‌యాణికుడి వ‌ద్ద భారీగా బంగారం ఉంద‌ని గుర్తించారు. స‌దరు ప్ర‌యాణికుడిని క్షుణ్ణంగా త‌నిఖీ చేయ‌గా రూ.54.67లక్షల విలువైన బంగారం ల‌భ్య‌మైంది. ఆ ప్ర‌యాణికుడు ఈ రోజు ఉద‌యం దుబాయి నుంచి ముంబయి ఎయిర్‌పోర్టుకి చేరుకున్నాడ‌ని అధికారులు మీడియాకు తెలిపారు. తాము స్వాధీనం చేసుకున్న‌ బంగారం అంతా  18 బంగారు బిస్కెట్ల రూపంలో ఉంద‌ని తెలిపారు. స‌ద‌రు ప్ర‌యాణికుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచార‌ణ ప్రారంభించారు.

More Telugu News