panner selvam: కేంద్ర బ‌ల‌గాల‌ను రంగంలోకి దింపచ్చు!: ప‌న్నీర్ సెల్వం

తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేలో సంక్షోభం కొనసాగుతున్న నేప‌థ్యంలో ఆ పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ శశికళ సుమారు 120 మంది ఎమ్మెల్యేల‌ను ప‌లు ప్ర‌దేశాలకి త‌ర‌లించిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు ఆ రాష్ట్ర ఇన్ ఛార్జీ గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు నుంచి ఇప్ప‌టికీ ప్ర‌క‌టన రాక‌పోవ‌డంతో ఆ రాష్ట్రంలో ప్ర‌భుత్వ ఏర్పాటు ఎవ‌రు చేస్తార‌నే ఉత్కంఠ అలాగే కొన‌సాగుతోంది. అయితే, ఆ రాష్ట్ర ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై ఎటువంటి నివేదికలు ఇంకా అందలేదని కేంద్ర హోం శాఖ ఈ రోజు పేర్కొన్న నేప‌థ్యంలో ప‌న్నీర్ సెల్వం ఈ అంశంపై స్పందించారు. ఒక‌వేళ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు నిర్బంధంలో ఉన్నార‌ని తెలిస్తే, గవర్నర్ కేంద్ర బ‌ల‌గాల‌ను రంగంలోకి దింపచ్చని ఆయ‌న చెప్పారు.

More Telugu News