: టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో టీమిండియా రికార్డు

బంగ్లాదేశ్ క్రికెట్ జ‌ట్టుతో టిమిండియా ఉప్ప‌ల్ వేదిక‌గా ఆడుతున్న ఏకైక‌ టెస్టు మ్యాచులో చ‌రిత్ర సృష్టించింది. టీమిండియా బ్యాట్స్‌మెన్‌ ముర‌ళీ విజ‌య్‌, విరాట్ కోహ్లీ, ర‌హానే, సాహా పారించిన ప‌రుగుల వ‌ర‌ద‌తో టీమిండియా 600 ప‌రుగుల మార్కును దాటేసింది. దీంతో వరుసగా మూడు టెస్టుల్లో 600కి పైగా ప‌రుగులు చేసిన జ‌ట్టుగా చ‌రిత్ర సృష్టించింది. ఇప్ప‌టికి ఆరు వికెట్లు కోల్పోయిన టీమిండియాలో 660 ప‌రుగులతో క్రీజులో ఉంది. క్రీజులో సెంచ‌రీతో సాహా, అర్ధ‌సెంచ‌రీతో జ‌డేజా ఉన్నారు. టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో రాహుల్ 2, జ‌డేజా 108, పుజారా 83, విరాట్ కోహ్లీ 204, ర‌హానే 82, అశ్విన్ 34, సాహా 104 (బ్యాటింగ్‌) జ‌డేజా 50 (బ్యాటింగ్) చేశారు.

More Telugu News