: బాబీ, తారక్ లకు నా ట్యూన్స్ నచ్చడం చాలా ఆనందంగా ఉంది: దేవిశ్రీ ప్రసాద్

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సందర్భంగా మ్యూజిక్ సిట్టింగ్ ప్రారంభించిన విషయాన్ని బాబీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు. ఈ ట్వీట్ తో పాటు తారక్, దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి దిగిన ఒక సెల్ఫీని కూడా పోస్ట్ చేశాడు. అయితే, బాబీ ట్వీట్ పై స్పందించిన దేవిశ్రీ..‘ ట్యూన్స్ ను ఇష్టపడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా కృతఙ్ఞతలు డియర్ సర్ ర్ ర్ జీ అండ్ డియర్ తారక్! మ్యూజిక్ కంపోజేసే సమయంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను!...’అని అన్నాడు.  

More Telugu News