nagarjuna: ఇలాంటి చిత్రాల్లో నటించడం నా అదృష్టం: నిజామాబాద్ జిల్లాలో నాగార్జున

రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున ప్రధానపాత్రలో వచ్చిన మరో భక్తిరసా చిత్రం ఓం నమో వేంకటేశాయ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా ఆ చిత్రం నిర్మాత మహేష్‌రెడ్డి, యూనిట్‌ సభ్యులతో పాటు నాగార్జున నిజామాబాద్ జిల్లా నర్సింపల్లిలోని ఇందూరు తిరుమల దేవాలయానికి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అక్క‌డ ప్ర‌త్యేక పూజ‌ల అనంత‌రం నాగార్జున మీడియాతో మాట్లాడారు.

తన సినీ కెరీర్‌లో ఓం నమో వేంకటేశాయ చిత్రం ది బెస్ట్ సినిమాగా నిలుస్తుందని ఆయ‌న అన్నారు. తాను ఇంత‌కు ముందు న‌టించిన‌ అన్నమయ్య, రామదాసు, షిరిడి సాయి చిత్రాల‌ను గుర్తు తెచ్చుకున్న ఆయ‌న‌.. ఇలాంటి భక్తిరస చిత్రాల్లో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ భారతీయ సంస్కృతిని పరిరక్షించే బాధ్య‌త‌ను భుజాన వేసుకున్న‌ మా పల్లె చారిటబుల్ ట్రస్ట్‌కు ధన్యవాదాలు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు.

More Telugu News