: నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థులు.. పెద్ద ఎత్తున నోట్లు, ప్రింటర్ స్వాధీనం

కలర్ ప్రింటర్ సాయంతో నకిలీ నోట్లను ముద్రించి వాటిని చలామణి చేస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా హిమాయత్‌సాగర్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీ క్యాంటిన్‌లో నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ఇద్దరు విద్యార్థులు సహా నలుగురిని ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.36 లక్షల విలువైన రూ.2వేల నోట్లు, కలర్ ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News