: శశికళను వ్యతిరేకించిన ‘పన్నీరు’ను కొనియాడిన కమల్, ఖుష్బూ, ఇతర సినీ నటులు!

తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం నిన్న రాత్రి ‘అమ్మ’ జయలలిత సమాధి వద్ద నలభై ఐదు నిమిషాల పాటు గడిపిన అనంతరం, జయలలిత మృతి, తన రాజీనామా గురించి ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నమ్మ శశికళకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పన్నీరు సెల్వంను తమిళ సినీనటులు కొనియాడారు. ముఖ్యంగా ప్రముఖ నటుడు కమల హాసన్ స్పందిస్తూ, 'తమిళనాడు ప్రజలారా, త్వరగా నిద్రపోండి, రేపు వాళ్లు మనకంటే ముందే నిద్ర లేస్తారు' అన్నారు.

ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ పార్టీ నేత ఖుష్బూ కూడా తనదైన శైలిలో స్పందించారు. మౌనాన్ని వీడిన ఓపీఎస్, ఒక హీరోగా ముందుకొచ్చారని, ఇప్పుడే డ్రామా మొదలైందని పేర్కొంది. 56 అంగుళాల ఛాతి ఉన్న నేత తరపున ఓపీఎస్ పనిచేయడం లేదని తాను ఆశిస్తున్నట్లు ఖష్బూ పేర్కొంది. ఓపీఎస్ సార్, సరైన సమయంలో గొప్పగా, ధైర్యంగా మాట్లాడారని, ఆయనకు హాట్సాప్ అని యువనటుడు ఆర్య అన్నాడు. మరో నటుడు అరవిందస్వామి చెబుతూ.. 'బఠానీలు తింటూ న్యూస్ చూస్తున్నాను, ఉప్స్ (ఓపీఎస్) ఒకటి పగిలింది, ఇక, పాప్ కార్న్ తింటా'నని అన్నాడు. దక్షిణాది నటుడు సిద్ధార్థ స్పందిస్తూ.. మెరీనాలో ఓపీఎస్, తమిళనాడు రాజకీయాలు హాలీవుడ్ డ్రామా సిరీస్ ‘గేమ్ ఆఫ్ థోర్న్స్’, హాలీవుడ్ మూవీ ‘హౌస్ ఆఫ్ కార్డ్స్’ను తలపిస్తున్నాయన్నాడు.

More Telugu News